చెన్నై : సినిమాను ఫ్యాషన్గా భావించే సాంకేతిక నిపుణులతో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమేనన్నారు నటి అనుష్క. పాత్రలో మమేకం అవడానికి ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవడానికి సాహసించే అతి కొద్ది మంది నటీమణుల్లో అనుష్క ముందుంటారు. త్వరలో విడుదల కానున్న ఇంజి ఇడుప్పళగి చిత్రం కోసం సుమారు 20 కిలోల బరువు పెరగడంలోనే ఆమె అంకిత భావం ఏమిటో అర్థమవుతోంది. ఇక నటిగా అనుష్క సత్తా ఏమిటన్న దానికి అరుందతి నిలువుటద్దం.అలాంటి ప్రతిభ కలిగిన అనుష్క రుద్రమదేవిగా మరోసారి వెండితెరపై వీర విజృంభణను అతి త్వరలో అఖిల సినీ ప్రేక్షకులు తిలకించబోతున్నారు.
ఈ చిత్రానికి దర్శకుడు గుణశేఖర్ సృష్టికర్త. అల్లు అర్జున్, రాణా, కృష్టంరాజు, నిత్యామీనన్ ప్రధాన తారాగణం నటించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అనుష్క రాణిగా రాజఠీవీని ప్రదర్శించారు. అందుకు ఆమె ధరించిన ఆభరణాలు ఒక కారణంగా చెప్పవచ్చు. ఆ ఆభరణాలన్నీ ఒరిజినల్ కావడం విశేషం.ఇలా అసలు సిసలైన ఆభరణాలు ధరించి నటించిన చిత్రం రుద్రమదేవి కావడం మరో విశేషం.
అనుష్క మాట్లాడుతూ గుణశేఖర్ లాంటి సినిమాని ఫ్యాషన్గా భావించే దర్శకుడితో పని చేయడం సంతోషంగా ఉందన్నారు.రుద్రమదేవి ధరించే ఈభరణాల కోసం కళా దర్శకుడు తరణి,డిజైనర్ సీతాలోనా ఎంతో అన్వేషణ చేసి ఎన్ఏసీ జ్యూలరీ వారి సహకారంతో రూపొందించారన్నారు. బరువైన ఆభరణాలు ధరించి నటించడం కష్టం అనిపించినా చిత్ర కథ ఇన్స్పైర్ చేయడంతో ఇష్టంగానే నటించానన్నారు. రుద్రమదేవి చిత్రం అందరికీ నచ్చుతుందని అనుష్క అన్నారు.