సాక్షి, హైదరాబాద్: 'ఇక నా దృష్టంతా సినిమాలపైనే.. ' సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు జయప్రద తెలిపారు. చెన్నై ప్రసాద్ ల్యాబ్లో శనివారం శరభ చిత్రం టీజర్ లాంచ్ చేశారు. ఈ చిత్రంలో జయప్రద ప్రధాన భూమిక పోషిస్తున్నారు.
ఈ సందర్భంగా తెలుగు మీడియాతో జయప్రద మాట్లాడుతూ కొంతకాలంపాటు రాజకీయాలకు దూరంగా ఉంటానని తెలిపారు. రాజకీయాల్లో ఉండటం వల్ల సినీ దర్శకులు మంచి కథలతో తన వద్దకు రాలేకపోయారని చెప్పారు. ప్రస్తుతం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో నాలుగు చిత్రాలతో నటిస్తూ బిజీగా ఉన్నానని వివరించారు.