జియో సపోర్ట్తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్

18 Oct, 2016 13:05 IST|Sakshi
జియో సపోర్ట్తో ఐ-బాల్ కొత్త ట్యాబ్లెట్

ప్రముఖ మొబైల్ ఉత్పత్తుల సంస్థ ఐ-బాల్‌ సరికొత్త ట్యాబ్ ను మార్కెట్ లో లాంచ్  చేసింది.  రిలయన్స్ జియో  సపోర్ట్ చేసే 4 జీ ట్యాబ్లెట్  ను 'స్లైడ్ క్యూ 27' పేరుతో  విడుదల చేసింది.  దీని ధరను రూ.12,799 గా కంపెనీ నిర్ణయించింది. ఈ టాబ్లెట్ లు ఇప్పటికే మార్కెట్ లో అమ్మకానికి అందుబాటులోకి వచ్చాయని తెలిపింది.

స్లైడ్ క్యూ 27'  ఫీచర్స్

10.10 అంగుళాల డిస్ ప్లే
1.3గిగా హెడ్జ్ క్వాడ్-కోర్ ప్రాసెసర్
ఆండ్రాయిడ్ 6.0
800x1280పిక్సెల్స్ రిజల్యూషన్
2ఎంపీ ఫ్రంట్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
5ఎంపి రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
 2జీబీ ర్యామ్  
16జీబీ స్టోరేజ్
32జీబీ ఎక్స్ పాండబుల్ మెమొరీ
5500ఎంఏహెచ్ బ్యాటరీ
 

మరిన్ని వార్తలు