ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతాయి: మోడీ

13 Nov, 2014 10:11 IST|Sakshi
ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతాయి: మోడీ
నే పీ: భారత ప్రధాని నరేంద్రమోదీ, రష్యా ప్రధాని దిమిత్రి మెద్వెదేవ్ లు భేటి అయ్యారు. ఇరుదేశాల సంబంధాలు మరింత బలపడుతాయని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత, రష్యాల మధ్య సంబంధాలు బలపడుతాయని బలంగా నమ్ముతున్నాను అని మెద్వెదేవ్ కు పంపిన సందేశంలో మోడీ పేర్కొన్నారు. 
 
తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ ప్రకటన ఇరుదేశాల మధ్య సంబంధాలు మెరుపడుతాయని భావిస్తున్నారు. ప్రస్తుతం మియన్మార్ లో ప్రధాని పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. మాకు భారత దేశం సన్నిహితమైన, విలువైన భాగస్వామ్య దేశం అని మెద్వెదేవ్ ఓ సందేశంలో తెలిపారు. 
మరిన్ని వార్తలు