మా సహనాన్ని అలుసుగా తీసుకోవద్దు: భారత్

20 Aug, 2013 02:43 IST|Sakshi

పాకిస్థాన్‌కు భారత్ హెచ్చరిక
 న్యూఢిల్లీ: నియంత్రణ రేఖ వద్ద పాకిస్థాన్ తరచూ కాల్పుల విరమణను ఉల్లంఘిస్తున్న తరుణంలో.. తమ సహనాన్ని అలుసుగా తీసుకోవద్దని ఆ దేశాన్ని భారత్ హెచ్చరించింది. ఈ మేరకు రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ సోమవారం రాజ్యసభలో ఒక ప్రకటన చేశారు. ఐదుగురు భారత సైనికులను కాల్చివేసిన ఘటనకు పాకిస్థాన్ బాధ్యత వహించక తప్పదని.. ఆ దేశానికి, వారి సైన్యానికి సంబంధం లేకుండా అదంతా జరగదని వ్యాఖ్యానించారు. ఆ దేశం తరచూ కాల్పులకు దిగుతోందని, వాటిని భారత సైన్యం సమర్థవంతంగా తిప్పికొడుతోందని ఆంటోనీ పేర్కొన్నారు. ఈ ఏడాది ఇప్పటివరకు పాకిస్థాన్ 82 సార్లు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని చెప్పారు. 

మరిన్ని వార్తలు