పళ్లు పీకాడు... ప్రాణాలు తీశాడు

23 May, 2014 18:04 IST|Sakshi

న్యూయార్క్: అమెరికాలో భారత దంత వైద్యుడొకరు నిర్లక్ష్యంతో రోగి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు. వృద్ధురాలికి ఒకేసారి దంతాలన్నీ పీకేందుకు ప్రయత్నించడంతో ఆమె మరణించింది. దీంతో అతడి లైసెన్స్ రద్దు చేశారు. డెంటిస్ట్ రష్మీ పటేల్ తన దగ్గరకు వచ్చిన 64 ఏళ్ల జూదిత్ గాన్ అనే వృద్ధురాలికి ఒకేసారి 20 దంతాలు పీకేందుకు ప్రయత్నించారు.

తన సహాయకుడు వద్దని వారించినా వినకుండా పటేల్ పళ్లు పీకేందుకు యత్నించారు. దీంతో సహాయకుడు బయటకు పరుగెత్తి అంబులెన్స్ కు ఫోన్ చేశాడు. అంబులెన్స్ వచ్చేసరికి వృద్ధురాలి స్పృహ తప్పిపోయివుంది. ఆస్పత్రికి తరలించిన తర్వాత ఆమె చనిపోయిందని న్యూయార్క్ డైలీ పేర్కొంది. అయితే తన వైద్యం వల్లే ఆమె చనిపోలేదని రష్మీ పటేల్ వాదిస్తున్నారు.

మరిన్ని వార్తలు