ఐఓబీ నికర లాభం రూ.133 కోట్లు

26 Oct, 2013 01:25 IST|Sakshi

 చెన్నై: ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్(ఐఓబీ) నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో 16% తగ్గింది. గత క్యూ2లో రూ.158 కోట్ల లాభం రాగా, ఈ క్యూ2లో రూ.133 కోట్ల లాభం ఆర్జించామని ఐఓబీ శుక్రవారం తెలిపింది. ఇక మొత్తం ఆదాయం రూ.5,515 కోట్ల నుంచి రూ.5,999.75 కోట్లకు పెరిగిందని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన 6 నెలల కాలానికి రూ.258 కోట్ల నికర లాభం సాధించామని, గతేడాది ఇదే కాలానికి రూ.392 కోట్ల లాభం ఆర్జించామని, 34% క్షీణత నమోదైందని వివరించింది. మొత్తం ఆదాయం రూ.10,918 కోట్ల నుంచి రూ.12,187 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.2,574 కోట్ల నుంచి రూ.2,768 కోట్లకు పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో స్థూల మొండిబకాయిలు రూ.8,202 కోట్లుగా, నికర మొండి బకాయిలు రూ.4,875 కోట్లుగా ఉన్నాయని ఐఓబీ వివరించింది.
 

మరిన్ని వార్తలు