భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి

10 Oct, 2014 21:14 IST|Sakshi
భారతీయుడికి నోబెల్ శాంతి బహుమతి

స్టాక్‌హోం: ఈ సంవత్సరం నోబెల్ శాంతి పురస్కారం భారత్, పాకిస్థాన్ లకు సంయుక్తంగా దక్కింది. భారతీయుడు కైలాశ్ సత్యార్థి,  పాకిస్థాన్ హక్కుల కార్యకర్త మలాలా యూసఫ్‌జాయ్‌ లను సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి వరించింది. వీరిద్దరూ బాలల హక్కుల కార్యకర్తలు కావడం విశేషం.

బాలలు, యువత హక్కుల కోసం పోరాడినందుకు వీరికి నోబెల్ పురస్కార కమిటీ ఈ అవార్డు ప్రకటించింది. చిన్నారుల చదువు కోసం వీరు రాజీలేని పోరాటం చేశారని కమిటీ ప్రశసించింది. పాకిస్థాన్ బాలికల విద్యాహక్కు కోసం మలాలా తీవ్రవాదులకు తూటాలకు ఎదురునిలిచింది.

మరిన్ని వార్తలు