కాగ్నిజెంట్‌పై పోరుకు సై అన్న ఉద్యోగులు

9 May, 2017 16:37 IST|Sakshi
కాగ్నిజెంట్‌పై పోరుకు సై అన్న ఉద్యోగులు
చెన్నై: భారీగా ఉద్యోగుల తొలగింపులపై ఐటీ ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా  ప్రముఖ ఐటీసేవల సంస్థ కాగ్నిజెంట్  సీనియర్‌ స్థాయి  టెకీలపై వేటు వేస్తున్న నేపథ్యంలో రెండు గ్రూపులు తమిళనాడు  ప్రభుత్వాన్ని ఆశ్రయించాయి.  ఫోరమ్ ఆఫ్ ఐటి ఎంప్లాయీస్ (ఫైట్),  ఎన్‌డీఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల వింగ్  ఈ తొలగింపులకు వ్యతిరేకంగా పిటిషన్ దాఖలు చేశాయి. పెర్‌ఫామెన్స్‌ఆధారంగా  కాగ్నిజెంట్‌  ఉద్యోగులపై వేటు వేస్తున్న ధోరణినుంచి,  సాఫ్ట్‌వేర్‌  ఇంజనీర్ల ప్రయోజనాలను కాపాడాలంటూ రాష్ట్ర కార్మికశాఖ వద్ద ఈ పిటిషన్‌ దాఖలు చేశాయి.  
అయితే పెర్‌ఫామెన్స్‌ ఆధారంగా ఉద్యోగులను తొలగిస్తున్నారన్న ఆరోపణలను కాగ్నిజెంట్‌  తిరస్కరించింది.  తక్కువ  నైపుణ్య ప్రదర్శన కారణంగా ఉద్యోగులే కొంతమంది  సంస్థను వీడుతున్నట్టు ప్రకటించింది. "కాగ్నిజెంట్ ఏ తొలగింపులను నిర్వహించలేదు. ప్రతి సంవత్సరం, మా పరిశ్రమ అంతటా ఉత్తమ సాధనంగా, మేము క్లయింట్ అవసరాలను తీర్చడానికి ,  మా వ్యాపార లక్ష్యాలను సాధించడానికి అవసరమైన ఉద్యోగి నైపుణ్యం ఉన్నట్లు నిర్ధారించడానికి మేము ఒక సమీక్షను నిర్వహిస్తాం. ఈ ప్రక్రియ కంపెనీల నుంచి మార్పు చెందుతున్న కొంతమంది ఉద్యోగులతో సహా మార్పులకు దారితీస్తుంది "అని  కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.  
 
న్యూ డెమోక్రటిక్ లేబర్ ఫ్రంట్ (ఎన్‌డీఎల్‌ఎఫ్‌) కు అనుబంధంగా పనిచేస్తున్న ఎన్‌డీఎల్‌ఎఫ్‌ ఐటి ఎంప్లాయీస్ వింగ్, ఇతర రాష్ట్రాల్లో యూనియన్లను స్థాపించాలని భావిస్తున్నట్టు తెలిపారు.  వివిధ కంపెనీల నుంచి దాదాపు 100 ఫిర్యాదులు అందుతున్నాయని ఆరోపించింది.  ఉద్యోగుల అక్రమ తొలగింపులపై ఆయా రాష్ట్రాల కార్మిక శాఖతో  సంప్రదింపులు జరుపుతున్నామన్నారు.   తమ ఉద్యమాన్ని  బలోపేతం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో యూనియన్ను ఏర్పాటు చేసే ప్రక్రియలో ఉన్నామని అని  యూనియన్‌కు చెందిన  కుమార్ ఎస్ అన్నారు. తమిళనాడు, పుదుచ్చేరిలో ఎన్డిఎల్ఎఫ్ ఐటి ఉద్యోగుల విభాగం  ఉందని  కర్నాటక, మహారాష్ట్ర, తెలంగాణాలకు విస్తరణ ప్రణాళికలతో ఉన్నట్టు చెప్పారు.
 
>
మరిన్ని వార్తలు