మినహాయింపును పరిమితం చేయాలి

29 Nov, 2014 01:32 IST|Sakshi

* లోక్‌సభలో కరీంనగర్ ఎంపీ వినోద్

సాక్షి, న్యూఢిల్లీ: రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపును 40 మంది ఉద్యోగుల వరకూ ఉన్న సంస్థలకు వర్తింపజేయడం తగదని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కార్మిక చట్టం (రిటర్నుల దాఖలు మినహాయింపు, రిజిస్టర్ల నిర్వహణ మినహాయింపు) సవరణ బిల్లు-2014పై శుక్రవారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు.

19 నుంచి ఈ సంఖ్యను 40కి పెంచకుండా 25 వరకు ఉద్యోగులు ఉన్న సంస్థలకు మినహాయింపులు ఇవ్వాలని కోరారు. చిన్న సంస్థలకు సంక్లిష్టమైన నిబంధనలు అడ్డుగోడలా ఉండకుండా తెస్తున్న ఈ బిల్లుకు తాము మద్దతు ఇస్తున్నట్టు పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు