హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ

15 Sep, 2015 10:08 IST|Sakshi
హాంకాంగ్లో వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ

హాంకాంగ్ : తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులకు సహకరించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హాంకాంగ్లోని వాణిజ్య, వ్యాపారవేత్తలను కోరారు. మంగళవారం హాంకాంగ్లో స్థానిక వాణిజ్య, వ్యాపారవేత్తలతో కేసీఆర్ భేటీ అయ్యారు. అయితే ఈ రోజు సాయంత్రం కేసీఆర్ బృందం  హాంకాంగ్లోని పర్యాటక ప్రాంతాలను సందర్శించనుంది. అలాగే హాంకాంగ్లోని భారత రాయబారి ఈ రోజు కేసీఆర్ బృందానికి విందు ఇవ్వనున్నారు. ఆ విందుకు కేసీఆర్ బృందం హాజరుకానుంది. చైనా, హాంకాంగ్లో సీఎం కేసీఆర్ బృందం పర్యటన నేటితో ముగియనుంది. రేపు కేసీఆర్ బృందం హైదరాబాద్కు తిరుగు ప్రయాణం కానుంది. 

మరిన్ని వార్తలు