ఎల్‌ అండ్‌టీ కి భారీ ఆర్డర్లు

31 Mar, 2017 14:44 IST|Sakshi

ముంబై: దేశీయ నిర్మాణం, ఇంజనీరింగ్  దిగ్గజ సంస్థ  లార్సెన్ & టుబ్రో (ఎల్ అండ్ టి)  భారీ ఆర్డర్లను సాధించింది. మార్చిలో మొత్తం రూ. 18,549 కోట్ల విలువైన ఆర్డర్లు లభించినట్లు వెల్లడించిన మౌలిక సదుపాయాలు, ఇంజినీరింగ్‌ దిగ్గజం ఎల్‌అండ్‌టీ కౌంటర్‌ బలపడింది.  .   ప్రస్తుతం బీఎస్‌ఈలో 1.6 శాతం పెరిగి,52 వారాల గరిష్ఠానికి చేరువలోఉంది. ఈ నెలలో ఇప్పటివరకూ సెన్సెక్స్‌ 3 శాతం పుంజుకోగా.. ఎల్‌అండ్‌టీ షేరు 8 శాతం  పెరగడం విశేషం. కాగా.. ఈ షేరు ఇంతక్రితం 2016 ఆగస్ట్‌లో ఈ స్థాయికి చేరింది.
 

మరిన్ని వార్తలు