లాలూకు తప్పిన ముప్పు

16 Oct, 2015 18:28 IST|Sakshi

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మరోసారి ప్రమాదం నుండి బయటపడ్డారు. శుక్రవారం ఆయన పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. అయితే ఆ ఫ్యాన్  లాలూకి కొంచం పక్కగా పడటంతో పెను ప్రమాదం తప్పింది. ఇటీవల లాలూ ప్రసాద్ యాదవ్ పాల్గొన్న ఓ ప్రచార సభలో వేదిక కూలిపోయిన సంగతి తెలిసిందే. ఈ రెండు ఘటనలలో లాలూ క్షేమంగా బయటపడడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.

మరిన్ని వార్తలు