హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రభుత్వరంగ సంస్థ సెయిల్కు చెందిన తస్రా బొగ్గు గని ప్రాజెక్టును అభివృద్ధి చేసే కాంట్రాక్టును ల్యాంకో ఇన్ఫ్రా దక్కించుకుంది. సెయిల్ సొంత అవసరాల కోసం ఏర్పాటు చేసుకుంటున్న విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించి ఈ మైనింగ్ను అభివృద్ధి చేస్తున్నట్లు ల్యాంకో ఇన్ఫ్రా బుధవారం బీఎస్ఈకి తెలియచేసింది. జార్ఖండ్లో 250 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలను తస్రా కలిగి ఉంది.