కారుబాంబు పేలి నలుగురి మృతి

17 Mar, 2014 11:18 IST|Sakshi

తూర్పు లెబనాన్లో ఓ ఆత్మాహుతి దళ సభ్యుడు తానున్న కారును పేల్చేసుకోవడంతో నలుగురు మరణించగా, ఏడుగురు గాయపడ్డారు. ఈ సంఘటన నబీ ఓత్మాన్ పట్టణంలో జరిగింది. మెయిన్ రోడ్డులో ఉన్న ఓ పెట్రోలు బంకు వద్ద ఈ కారు పేలింది. సుమారు 20 కేజీల బరువున్న పేలుడు పదార్థాలను ఈ దాడికి ఉపయోగించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈ దాడి చేసింది తామేనని అల్-నస్రా అనే తీవ్రవాద సంస్థ ప్రకటించింది.

అంతకుముందు ఫ్రీ సున్నీ బెటాలియన్ అనే సంస్థ కూడా తాము ఈ దాడి చేసినట్లు చెప్పినా అది తప్పని, పేల్చింది తామేనని అల్ నస్రా తెలిపింది. సిరియాలో హెజ్బొల్లా వేలుపెట్టడానికి నిరసనగా తామీ దాడి చేశామంది. ఈ సంస్థకు అల్ ఖైదాతో సంబంధాలు ఉన్నట్లు సమాచారం. సున్నీలపై దాడులు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ప్రభుత్వాన్ని హెచ్చరించింది.

మరిన్ని వార్తలు