ముంబై: బ్యాంకులకు పెద్ద ఎత్తున రుణాలు ఎగవేసి ఇంగ్లండ్లో తలదాచుకుంటున్న లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మరో ఎదురు దెబ్బ తగిలింది. మాల్యాకు చెందిన 1620 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసుకుంది.
మనీలాండరింగ్ కేసుకు సంబంధించి గురువారం ముంబైలోని పీఎంఎల్ఏ కోర్టు మాల్యా ఆస్తులను స్వాధీనం చేసుకోవాల్సిందిగా ఈడీని ఆదేశించింది. కాగా మాల్యాకు చెందిన విదేశీ ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలన్న ఈడీ అభ్యర్థనను కోర్టు తోసిపుచ్చింది. శుక్రవారం ఈడీ స్వాధీనం చేసుకున్న మాల్యా 1620 కోట్ల సంపద చరాస్తులకు సంబంధించినది.