రేపిస్టుకు 20 ఏళ్ల జైలు

5 Aug, 2014 22:48 IST|Sakshi

సూరి: నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడొకరికి పశ్చిమబెంగాల్ లోని స్థానిక న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. నందన్ సాహా గతేడాది ఆగస్టు 6న బిర్భుం జిల్లా నానూర్ లోని కిర్నార్హర్ గ్రామంలో నాలుగేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాలికను ఎత్తుకెళ్లి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో అతడికి అడిషినల్ సెషన్స్ జడ్జి మహానంద దాస్ 20 ఏళ్ల జైలుశిక్ష విధించారు. రూ.20వేలు పరిహారం చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు.

మరిన్ని వార్తలు