దిగ్భ్రాంతికర ఘటన

23 Mar, 2017 12:07 IST|Sakshi
దిగ్భ్రాంతికర ఘటన

మీరట్: ఉత్తరప్రదేశ్‌ లోని ముజాఫర్ నగర్ జిల్లాలో బుధవారం దిగ్భ్రాంతికర ఘటన చోటుచేసుకుంది. చిన్నవయసులోనే ప్రేమలో పడిందన్న కోపంతో ఓ వ్యక్తి తన 15 ఏళ్ల కూతురిని కిరాతంగా హత్య చేశాడు. అక్కడితో ఆగకుండా కుమార్తె మృతదేహాన్ని ఆమె ప్రియుడి ఇంటి ముందు పడేశాడు.

ముజాఫర్ నగర్ జిల్లాలోని ఛరత్వాల్ గ్రామంలో పట్టపగలు ఈ దారుణం చోటు చేసుకుంది. వస్త్ర కార్మికుడిగా పనిచేస్తున్న జాబర్ ఖురేషి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తమ మాటను ఖతారు చేయకుండా పక్కింటి కుర్రాడు దిన్లావాజ్ అహ్మద్ తో ప్రేమలో పడిందన్న కోపంతో కూతురి గొంతు కోసి హత్య చేశాడు. తర్వాత ఆమె మృతదేహాన్ని అహ్మద్ ఇంటి ముందు పడేశాడు. అనంతరం నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోయాడు. నేరం చేశానని పోలీసుల ఎదుట ఒప్పుకున్నాడు.

మరిన్ని వార్తలు