భిండ్: భార్య పుట్టింటివారికి డబ్బులు పంపిందనే కారణంతో భర్త ఆమెను కాల్చిచంపాడు. మధ్యప్రదేశ్లో భిండ్ జిల్లాలోని ఓ గ్రామంలో ఈ దారుణం జరిగింది. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.
జౌరి అహిర్ గ్రామంలో డబ్బుల విషయంలో అరవింద్ సింగ్ యాదవ్ (50), గీత (47) గొడవపడ్డారు. గీత తన కుటుంబ సభ్యులకు డబ్బులు పంపినందుకు అరవింద్ నిలదీశాడు. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరగడంతో అరవింద్ కోపంతో తన దగ్గరున్న లైసెన్స్ గన్ తీసుకుని భార్యను కాల్చాడు. మృతురాలి కొడుకు వాంగ్మూలం మేరకు పోలీసులు అరవింద్ను అదుపులోకి తీసుకుని తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.