రెండో భార్యను పీక పిసికి చంపిన భర్త

4 Feb, 2014 16:04 IST|Sakshi

రెండో భార్య అంటే సాధారణంగా ఎవరికైనా మోజు ఉంటుంది. చాలా అపురూపంగా చూసుకుంటారు. కోరినవన్నీ ఇట్టే కొని ఇచ్చేస్తుంటారు. కానీ, మహారాష్ట్రలో మాత్రం ఓ భర్త తన రెండో భార్యను పీక పిసికి చంపేశాడు. థానె జిల్లాలోని భివాండీ టౌన్షిప్ ప్రాంతంలో గల కల్హెర్ గ్రామానికి చెందిన అతుల్ బర్మన్.. తనకు ముందే పెళ్లయిందన్న విషయాన్ని అతడు దాచిపెట్టి ఉంచి, లత (27)ను రెండో పెళ్లి చేసుకున్నాడు.

ఆ విషయం తర్వాత లతకు తెలియడంతో ఇద్దరి మధ్య తరచు గొడవలు అవుతుండేవి. ఇంట్లో తరచు జరుగుతున్న గొడవలతో బాగా విసుగు చెందిన అతుల్ బర్మన్, తన రెండో భార్యను ఆదివారం రాత్రి పీక పిసికి చంపేసి, ఇంట్లోంచి పారిపోయాడు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. అతడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.

>
మరిన్ని వార్తలు