ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు

19 Oct, 2015 13:25 IST|Sakshi
ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం' చేస్తున్నారు

భారత్, పాకిస్థాన్ల మధ్య క్రికెట్ సిరీస్ను నిర్వహిచకూడదంటూ బీసీసీఐ కార్యాలయంపై శివసేన కార్యకర్తలు దాడి చేసిన ఘటనను కాంగ్రేస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ ఘటనపై కాంగ్రేస్ నేత మనీష్ తివారీ మాట్లాడుతూ.. మహారాష్ట్రలో శాంతిభద్రతలు పూర్తిగా కరువయ్యాయని అన్నారు.

 

ప్రజాస్వామ్యాన్ని 'మూకస్వామ్యం'గా మారుస్తున్నారని ఆరోపించారు. ఇటీవల శివసేన కార్యకర్తల నిరసనలతో.. పాకిస్థానీ గాయకుడు గులామ్ అలీ కార్యక్రమం రద్దు కావడం దురదృష్టకరమన్నారు. మహారాష్ట్రలో శాంతిభద్రతల పునరుద్ధరణ కోసం రాష్ట్రపతి ప్రణబ్ చర్యలు తీసుకోవాలని తివారీ కోరారు.


 

>
మరిన్ని వార్తలు