'సీట్లు ఇవ్వకపోయినా మద్దతిస్తామన్నాం'

14 Sep, 2015 19:05 IST|Sakshi
'సీట్లు ఇవ్వకపోయినా మద్దతిస్తామన్నాం'

న్యూఢిల్లీ: తమకు కేటాయించిన స్థానాల పట్ల బిహార్ మాజీ సీఎం, హిందూస్థాన్ అవామ్ మోర్చా(హెచ్ఏఎం) అధ్యక్షుడు జితన్ రామ్ మాంఝీ సంతృప్తి వ్యక్తం చేశారు. ఎల్జేపీ నేత రాంవిలాస్ పాశ్వాన్ తో విభేదాలు సమసిపోయాయని ప్రకటించారు. ఎన్డీఏ కూటమిలో అందరికీ ఆమోదయోగ్యంగా సీట్ల పంపకాలు జరిగాయని తెలిపారు. బిహార్ అసెంబ్లీలో ఎన్డీఏ కూటమి విజయానికి కలికట్టుగా పనిచేస్తామని అన్నారు.

' సీట్ల పంపకంలో బీజేపీ వెలువరించిన నిర్ణయం చాలా బాగుంది. దీనికి మేము ఒప్పుకుంటున్నాం. మాకు కేటాయించిన స్థానాలపై సంతృప్తిగా ఉన్నాం. బేషరతుగా కూటమిలో కొనసాగుతున్నాం. అసలు మాకు సీట్లు ఇవ్వకపోయినా ఎన్డీఏలో ఉంటామని బీజేపీకి చెప్పాను' అని మాంఝీ వెల్లడించారు. ఎన్నికల్లో తాను పోటీ చేసే విషయంపై త్వరలో నిర్ణయం ప్రకటిస్తానన్నారు.

మరిన్ని వార్తలు