ఎమ్మెల్యే పెట్రోలుబంకు, ఇంటిపై మావోయిస్టుల దాడి

14 Mar, 2014 11:13 IST|Sakshi
ఎమ్మెల్యే పెట్రోలుబంకు, ఇంటిపై మావోయిస్టుల దాడి

ఎన్నికల వేళ బీహార్లో మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ ఎమ్మెల్యేకు చెందిన ఓ పెట్రోలు బంకును తగలబెట్టారు. ఆయన ఇంటిపై బాంబులు వేసి, కాల్పులు జరిపారు. సుమారు 15-20 మంది సాయుధ మావోయస్టులు ఆహియాపూర్ పోలీసు స్టేషన్ పరిధిలోని బీజేపీ ఎమ్మెల్యే రాం సూరత్ రాయ్ పెట్రోలు బంకులోకి గురువారం రాత్రి దూసుకెళ్లారని, అక్కడున్న సిబ్బందిని తమ అదుపులోకి తీసుకుని, ఆయిల్ ట్యాంకర్కు, పెట్రోలు బంకులోని కొంత భాగానికి నిప్పు పెట్టారని ఎస్పీ సౌరభ్ కుమార్ తెలిపారు.

తర్వాత వాళ్లు బోచా పోలీసు స్టేషన్ పరిధిలోని రాయ్ ఇంటికి వెళ్లి, బాంబులు వేసి, కాల్పులు జరిపారన్నారు. అయితే దాడి జరిగిన సమయంలో ఆయన ఇంట్లో గానీ, బంకులో గానీ లేరు. ఇంట్లో ఉన్న భార్య, పిల్లలకు కూడా ఎలాంటి గాయాలు కాలేదు.

>
మరిన్ని వార్తలు