5 లక్షలు తగ్గనున్న మెర్సిడెస్ బెంజ్ ధర

27 Aug, 2013 08:28 IST|Sakshi

న్యూఢిల్లీ: మెర్సిడెస్ బెంజ్ కంపెనీ లగ్జరీ స్పోర్ట్స్ యుటిలిటి వెహికల్, జీఎల్-క్లాస్ ధర రూ. 5 లక్షలు తగ్గనున్నది. ఈ ఎస్‌యూవీని పుణే సమీపంలోని చకన్ ప్లాంట్‌లో తయారు చేయడం ప్రారంభించామని మెర్సిడెస్ బెంజ్ ఇండియా సోమవారం తెలిపింది. ఫలితంగా ఈ కారు ధర రూ. 5 లక్షలు దిగిరానున్నది.  అమెరికాలోని టస్కలూసా ప్లాంట్ వెలుపల ఈ జీఎల్-క్లాస్ ఎస్‌యూవీని అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి. ఈ ఏడాది మేలో మార్కెట్లోకి వచ్చిన ఈ కారు ధరను అప్పుడు రూ.77.5 లక్షలుగా కంపెనీ నిర్ణయించింది. ఈ ఎస్‌యూవీని దేశీయంగా అసెంబుల్ చేస్తుండటంతో దీని ధర రూ. 5 లక్షలు తగ్గి రూ.72.58 లక్షల(ఎక్స్ షోరూమ్,ఢిల్లీ)కు చేరింది.
 

మరిన్ని వార్తలు