పోలీసు పోస్ట్ పై ఉగ్రవాదుల దాడి

18 Aug, 2015 13:43 IST|Sakshi

శ్రీనగర్: జమ్మూకశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా బారాముల్లా జిల్లాలోని సొపోర్ లో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. మసీదుకు రక్షణ కల్పిస్తున్న పోలీసు పోస్ట్ పై మంగళవారం ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఈ దాడిలో పోలీసు కానిస్టేబుల్, పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

తుజ్జార్ షరీఫ్ ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని పోలీసు అధికారి ఒకరు తెలిపారు. కాల్పుల్లో గాయపడిన కానిస్టేబుల్ ఫయాజ్ అహ్మద్ ను ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని చెప్పారు. కానిస్టేబుల్ నుంచి ఐఎన్ఎస్ఏఎస్ తుపాకీని లాక్కుని ఉగ్రవాదులు పారిపోయారని తెలిపారు. సంఘటనా స్థలానికి అదనపు బలగాలను తరలించినట్టు చెప్పారు.

మరిన్ని వార్తలు