మైనర్ విద్యార్థి ఉరేసుకుని ఆత్మహత్య

13 Dec, 2013 14:25 IST|Sakshi

కాన్పూర్:   మైనర్ విద్యార్థి  ఉరేసుకుని ఆత్మహత్య పాల్పడిన ఘటన ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ లో చోటుచేసుకుంది. అభిషేక్ (15) అనే  విద్యార్థి ట్యుషన్ నుంచి తిరిగి వచ్చి  ఇంట్లో ఈ సంఘటనకు పాల్పడినట్లు  పోలీసులు పేర్కొన్నారు. కాగా ఆ సమయంలో విద్యార్థి తల్లిదండ్రులు ఇంట్లో లేరు.

 

  వైద్యుడిని కలిసేందుకు వెళ్లిన తాము  ఇంటికి తిరిగివచ్చేసరికి తలుపుకు గడియ వేసి వుందని, ఎంత పిలిచినా అభిషేక్ నుంచి స్పందన రాకపోవడంతో తలుపును పగలకొట్టినట్టుగా వారు తెలిపారు. తాము లోపలికి వెళ్లి చూడగా  ఫ్యానుకు వేలాడుతున్న అభిషేక్ ను గుర్తించమని, అయితే అప్పటికే తమ కుమారుడు మృతిచెందినట్టు వెల్లడించారు. కాగా అభిషేక్ ఆత్మహత్యకు గల కారణాలపై ట్యూషన్ టీచర్ ను, తల్లిదండ్రులను విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

మరిన్ని వార్తలు