ఉత్తరాఖండ్లో భూకంపం

3 Jun, 2015 18:43 IST|Sakshi

చార్ధామ్ క్షేత్రాలున్న ఉత్తరాఖండ్ రాష్ట్రంలో స్వల్ప భూకంపం వచ్చింది. బుధవారం సాయంత్రం 4.58 గంటల సమయంలో వచ్చిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 4 పాయింట్లుగా నమోదైంది. చమోలి కేంద్రంగా ఈ భూకంపం వచ్చినట్లు విపత్తు నివారణ కేంద్రం అధిపతి పీయూష్ రౌటేలా తెలిపారు.

మరిన్ని వార్తలు