ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం

26 May, 2015 14:08 IST|Sakshi
ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం

మరికొన్ని గంటల్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయనగా.. ఢిల్లీ అసెంబ్లీలో అగ్నిప్రమాదం సంభవించింది. ఢిల్లీ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ ఛాంబర్లోని ఏసీ పేలడంతో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో పలు ఫైళ్లు, కీలక డాక్యుమెంట్లు అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది. అయితే ప్రమాదం సంభవించే సమయానికి ఆరోగ్యమంత్రి మాత్రం ఆయన ఛాంబర్లో లేరు.

ప్రమాద విషయం తెలియగానే నాలుగు ఫైరింజన్లు ఢిల్లీ అసెంబ్లీకి హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేశాయి. అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి కొన్ని గంటల ముందే ప్రమాదం జరగడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రమాదం చిన్నదే అయినా.. ప్రమాద సమయం, సందర్భం మాత్రం అనుమానాలకు కారణం అవుతున్నాయి.

మరిన్ని వార్తలు