జమ్మూ కాశ్మీర్లో భూకంపం

16 Nov, 2013 14:56 IST|Sakshi

జమ్మూ కాశ్మీర్ లడక్లోని ఉత్తర లేహ్ ప్రాంతంలో ఈ రోజు తెల్లవారుజామున భూమి కంపించిందని  అధికారులు వెల్లడించారు. భూకంప తీవ్రత రిక్టార్ స్కేల్పై 4.0గా నమోదు అయిందని తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున 3.51 గంటలకు ఆ భూమి కంపించిందని చెప్పారు.

 

అయితే భూకంపం వల్ల ఎటువంటి ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కాని సంభవించినట్లు తమకు సమాచారం అందలేదని తెలిపారు. భూమి కంపించడంతో భయాందోళనకు గురైన ప్రజలు విధుల్లోకి పరుగులు తీశారని చెప్పారు. 

>
మరిన్ని వార్తలు