కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంస

6 Oct, 2014 16:37 IST|Sakshi
కాంగ్రెస్ సీఎంకు మోదీ ప్రశంస

న్యూఢిల్లీ: కాంగ్రెస్ ముఖ్యమంత్రిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో పాల్గొన్నందుకు అసోం సీఎం తరుణ్ గొగొయ్ ను ఆయన అభినందించారు. క్లీన్ ఇండియాలో కార్యక్రమంలో పాల్గొని అసోం ప్రజలకు గొగొయ్ స్ఫూర్తిగా నిలిచారని మోదీ ట్వీట్ చేశారు.

ముంబైలో స్వయంగా చీపురు పట్టి వీధులను శుభ్రం చేసిన సచిన్ టెండూల్కర్ ను కూడా మోదీ మెచ్చుకున్నారు. అందరం కలిసి 'స్వచ్ఛ భారత్' కార్యక్రమాన్ని విజయం చేద్దామని మోదీ పిలుపునిచ్చారు. అక్టోబర్ 2న ఈ కార్యక్రమాన్ని మోదీ ప్రారంభించారు.

మరిన్ని వార్తలు