మెట్రో రైలెక్కిన ప్రధాని మోదీ

6 Sep, 2015 11:38 IST|Sakshi
మెట్రో రైలెక్కిన ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఆకస్మికంగా ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించి  ప్రయాణికులను, రైల్వే అధికారులను ఆశ్చర్యపరిచారు. ఆదివారం ఉదయం మోదీ ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించారు.

ఈ రోజు ఉదయం జన్పథ్ స్టేషన్లో మెట్రో రైలు ఎక్కి  ఫరీదాబాద్ బాటా చౌక్ స్టేషన్లో దిగారు. షెడ్యూల్ ప్రకారం మోదీ హెలీకాప్టర్లో ఫరీదాబాద్ స్టేషన్కు వెళ్లాల్సి ఉండగా, రైలులో ప్రయాణించారు. మోదీ వెంట కేంద్ర మంత్రులు వెంకయ్య నాయుడు, వీరేందర్ సింగ్, రావు ఇందర్జీత్ సింగ్ తదితరులున్నారు.

మరిన్ని వార్తలు