తల్లీకూతుళ్లపై ఎస్సై కొడుకు అత్యాచారం

10 Jun, 2017 18:15 IST|Sakshi
తల్లీకూతుళ్లపై ఎస్సై కొడుకు అత్యాచారం
గురుగ్రామ్‌: హర్యానాలోని గురుగ్రామ్‌ అత్యాచారాలకు అడ్డంగా మారుతోంది. మనేసర్‌లో ఇటీవల ఓ వివాహితపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారం చేసి ఆమె 8 నెలల కుమారుడిని రోడ్డుపై విసిరేసిన ఘటన మర్చిపోకముందే.. అటువంటిదే మరో ఘటన జరిగింది. ఈసారి అత్యాచారానికి పాల్పడింది ఓ ఎస్సై కుమారుడు కావడం గమనార్హం. 
 
ఓ వివాహిత, ఆమె 15 ఏళ్ల కుమార్తెపై మూడు వారాలపాటు అత్యాచారానికి పాల్పడిన ఆరోపణలపై ఢిల్లీ పోలీస్ సబ్-ఇన్‌స్పెక్టర్ కుమారుడు 23 ఏళ్ల ఆశిష్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అత్యాచారం చేస్తుండగా తీసిన వీడియోలను బయటపెడతానని బెదిరించి వారిపై పదేపదే అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. అతడి నుంచి 10 వీడియో క్లిప్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. బీఏ ఫైనలియర్‌ చదువుతున్న ఆశిష్‌ బాధిత మహిళ ఇంట్లో ఉండగా... శుక్రవారం పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.  
>
మరిన్ని వార్తలు