ఏడేళ్ల కొడుకును కొట్టి చంపిన తల్లి

20 Oct, 2013 21:23 IST|Sakshi

కతిహార్(బీహార్): ఆమె పేరు సీతాదేవి. ఆ పేరు పెట్టకుని రాక్షసంగా ప్రవర్తించిందో ఓ ఇల్లాలు. సహనం, సంస్కారం మచ్చకైనా లేని ఆ మహిళ సవిత  కొడుకును కొట్టి చంపిన ఘటన సందాల్పూర్ లో సంభవించింది.  సీతాదేవి భర్తకు గతంలో పెళ్లయి రోహిత్ అనే కొడుకు ఉన్నాడు.   ఈ క్రమంలో అతని ముందు భార్యకు పుట్టిన కొడుకు  కూడా వీరితోనే ఉంటున్నాడు. సవతి కొడుకును భారంగా భావించిన ఆ ఇల్లాలు తీవ్రంగా కొట్టింది.

 

ఆ దెబ్బలకు తట్టుకోలేని ఆ బాలుడు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు.

మరిన్ని వార్తలు