సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లేబొరేటరీ (డీఆర్డీఎల్) డెరైక్టర్గా ఎంఎస్ఆర్ ప్రసాద్ నియమితులయ్యారు. దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఈ సంస్థకు ఓ తెలుగు శాస్త్రవేత్త డెరైక్టర్గా నియమితులవడం ఇదే తొలిసారి. దేశీ అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ నుంచి ప్రయోగించగల కలాం శ్రేణి క్షిపణుల తయారీలోనూ ప్రసాద్ ముఖ్యభూమిక వహించారు. గత ఏడాది 3500 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను కూడా ఛేదించగల కలాం-4 క్షిపణి అభివద్ధిని విజయవంతం చేసినందుకుగాను డీఆర్డీవో ఎంఎస్ఆర్ ప్రసాద్ బందానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది.
1961లో జన్మించిన ప్రసాద్ మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీటెక్ పూర్తిచేసిన ప్రసాద్.. ఆ తరువాత ఐఐటీ బాంబేలో ఏరోనాటికల్ ఇంజినీరింగ్లో ఎంటెక్ విద్యనభ్యసించారు.1984 నుంచి డీఆర్డీఎల్/డీఆర్డీవోలో శాస్త్రవేత్తగా చేరారు. అంచలంచెలుగా ఎదుగుతూ అడ్వాన్స్డ్ సిస్టమ్స్ గ్రూప్ ప్రాజెక్ట్ డెరైక్టర్గా ఎదిగిన ప్రసాద్ నావికాదళం కోసం ప్రత్యేక క్షిపణులను డిజైన్ చేయడం, అభివద్ధి చేయడంలోనూ కీలకపాత్ర పోషించారు.