శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం

25 Mar, 2014 11:35 IST|Sakshi
శ్రీనివాసన్.. ఇక తప్పుకో చాలు: సుప్రీం

ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసన్ మెడకు చుట్టుకుంది. స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు నిష్పక్షపాతంగా జరగాలంటే శ్రీనివాసన్ స్వయంగా ఆ పదవి నుంచి తప్పుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు మంగళవారం అభిప్రాయ పడింది. ఆయన తనంతట తాను ఆ పదవి నుంచి వైదొలుగుతారా లేక తాము జోక్యం చేసుకోవాలా అంటూ శ్రీనివాసన్ తరపు న్యాయవాదులను సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది.

లేకుంటే బీసీసీఐ అధ్యక్ష పదవి నుంచి తొలగించాల్సి వస్తుందని హెచ్చరించింది. బీసీసీఐ అధ్యక్ష పదవికి రాజీనామా చేయకుండా ఆ కుర్చీని అంటిపెట్టుకుని ఉండటంలో అంతర్యమేమిటని సుప్రీం ప్రశ్నించింది. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసు దర్యాప్తు చూస్తుంటే వాంతు వచ్చేలా ఉందని సుప్రీం వ్యాఖ్యానించింది.

మరిన్ని వార్తలు