8,460 కు చేరిన మృతుల సంఖ్య

15 May, 2015 20:55 IST|Sakshi

కఠ్మాండు: నేపాల్ భూకంప మృతుల సంఖ్య 8,460 కు చేరింది. ఏప్రిల్ 25న సంభవించడంతో నేపాల్ చిన్నాభిన్నమైంది. 4,571  మంది గాయపడ్డారు. ఇప్పటివరకు 8,399 మృతదేహాలను సంబంధీకులకు అప్పగించినట్టు నేపాల్ హోంమంత్రిత్వ శాఖ తెలిపింది.

మే 12న మరోసారి భూమి కంపించింది. దీంతో మరో 117 మంది ప్రాణాలు కోల్పోగా, 1,700 మంది గాయపడ్డారు. వరుస భూవిలయాలతో నేపాల్ ప్రజలు వణికిపోతున్నారు.

>
మరిన్ని వార్తలు