పిల్లల భద్రతకు ఓ స్మార్ట్ ‘వాచ్’!

3 Dec, 2013 03:05 IST|Sakshi

వాషింగ్టన్: పిల్లల కిడ్నాప్‌లు, వారిపై నేరాలు పెచ్చుమీరుతున్న ప్రస్తుత తరుణంలో.. వారెక్కడున్నారో ఎప్పటికప్పుడు తెలుసుకునే వీలుంటే బావుండుననే ఆలోచన ప్రతీ తల్లిదండ్రులకు ఏదోఒక సమయంలో వచ్చే ఉంటుంది. ఆ ఆలోచనకనుగుణమైన ఒక స్మార్ట్‌వాచ్‌ను అమెరికాలో రూపొందించారు.

ఈ జీపీఎస్ ఆధారిత గడియారం ‘ఫిలిప్’ అనే ఒక యాప్(అప్లికేషన్) ద్వారా వారి తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌కు అనుసంధానమై ఉంటుంది. పిల్లలు సాధారణంగా ఎక్కువ సమయం గడిపే ఇల్లు, పాఠశాలలు మొదలైన ప్రాంతాలను సేఫ్ జోన్లుగా ఆ వాచ్, ఫోన్‌లలో స్టోర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సేఫ్ జోన్‌లోంచి పిల్లలు బయటకు వెళ్లిన మరుక్షణం ఆ సమాచారం తల్లిదండ్రుల స్మార్ట్‌ఫోన్‌కు తెలిసిపోతుంది. వెంటనే వారు ఆ పిల్లలకు ఫోన్ చేయడం కానీ, మెసేజ్ చేయడం కానీ చేయొచ్చు. అలాగే, ఎమర్జెన్సీ పరిస్థితుల్లో వాచ్‌లోని రెడ్ బటన్‌ను పిల్లలు నొక్కిపట్టుకుంటే.. తక్షణమే వాచ్‌నుంచి సంబంధీకులకు ఫోన్ వెళ్తుంది. వారెక్కడున్నారనే సమాచారమూ తెలుస్తుంది. అలా ఐదుగురి నెంబర్లను ఆ వాచ్‌లో ఫీడ్ చేయొచ్చు.
 

మరిన్ని వార్తలు