డాట్సన్ కార్లను సొంతంగానే విక్రయిస్తాం: నిస్సాన్

27 Nov, 2013 00:49 IST|Sakshi
డాట్సన్ కార్లను సొంతంగానే విక్రయిస్తాం: నిస్సాన్

 న్యూఢిల్లీ: త్వరలో రానున్న డాట్సన్ గో, డాట్సన్ ఇతర మోడళ్లను భారత్‌లో సొంతంగానే విక్రయిస్తామని నిస్సాన్ మోటార్ కంపెనీ మంగళవారం తెలిపింది. ప్రస్తుతం ఈ కంపెనీ కార్లను హోవర్ ఆటోమోటివ్ డీలర్లు విక్రయిస్తున్నారు. ముం దుగా డాట్సన్ గోను మార్కెట్లోకి తెస్తామని డాట్సన్ గ్లోబల్ హెడ్ విన్సెంట్ కోబీ పేర్కొన్నారు. ఆ తర్వాత ఆ మోడల్‌లో మరిన్ని వేరియంట్‌లను అందిస్తామని, వీటన్నింటినీ తాము ఏర్పాటు చేసే సొంత నెట్‌వర్క్ ద్వారా విక్రయిస్తామని వివరించారు.
 
 త్వరలో భారత్ మార్కెట్లోకి...
 నిస్సాన్ కంపెనీ డాట్సన్ గో మోడల్‌ను అంతర్జాతీయంగా జూలైలో ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ. 4 లక్షల లోపు ఉంటుందని అంచనా. దాదాపు 30 ఏళ్ల తర్వాత ఈ బ్రాండ్‌ను నిస్సాన్ కంపెనీ మళ్లీ మార్కెట్లోకి తెస్తోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో భారత్‌లో ఈ కార్ల విక్రయాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు