సోనియాను కలసిన నితీశ్‌

21 Apr, 2017 00:43 IST|Sakshi

న్యూఢిల్లీ: బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీశ్‌ కుమార్‌ గురువారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు వ్యతిరేకంగా విపక్షాలన్నింటీనీ ఏకం చేసే అంశంపై వీరి మధ్య చర్చ జరిగింది. రాష్ట్రపతి ఎన్నిక విషయంలో విపక్షాల తరపున సంయుక్త విపక్ష అభ్యర్థిని బరిలో దించటం విషయంలో ముందుండి నడపాలని కూడా సోనియాను నితీశ్‌ కోరినట్లు సమాచారం. ‘విపక్షాల తరపున బలమైన అభ్యర్థి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీచేయాలి. విపక్షాలకు సోనియాగాంధీ నాయకత్వం వహించాలి. దీనికితోడు విపక్షాలన్నీ ఏకమై ముందుకెళ్లాల్సిన అవసరం పైనా చర్చ జరిగింది’ అని జేడీయూ ప్రతినిధి త్యాగీ తెలిపారు.

మరిన్ని వార్తలు