న్యూఢిల్లీ: లూమియా మోడల్లో రెండు కొత్త ఫోన్లు, లూమియా 1320, లూమియా 525లను నోకియా సంస్థ మంగళవారం ఆవిష్కరించింది. విండోస్ 8 ఓఎస్పై పనిచేసే ఈ రెండు ఫోన్లు- లూమియా 1320 ఫ్యాబ్లెట్ ధర రూ.23,999. లూమియా 525 ధర రూ.10,399 అని నోకియా ఇండియా డెరైక్టర్(మార్కెటింగ్) విరళ్ ఓజా చెప్పారు. ఈ నెల 13 నుంచి విక్రయాలు ప్రారంభమయ్యే లూమియా 1320లో 6 అంగుళాల డిస్ప్లే, 1.7 గిగా హెర్ట్జ్ డ్యుయల్-కోర్ క్వాల్కామ్ స్పాప్డ్రాగన్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ మెమరీ, 64 జీబీ వరకూ ఎక్స్పాండబుల్ మెమరీ, 7 జీబీ స్కైడ్రైవ్ క్లౌడ్ స్టోరేజ్, 5 మెగా పిక్సెల్ బ్యాక్ కెమెరా, 0.3 మెగా పిక్సెల్ వీజీఏ ఫ్రంట్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఇక లూమియా 525లో 1 గిగా హెర్ట్జ్ డ్యుయల్ కోర్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, 5 మెగా పిక్సెల్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని పేర్కొన్నారు. మంగళవారం నుంచే ఈ ఫోన్ విక్రయాలు ప్రారంభమయ్యాయన్నారు. ఈ నెల 31లోపు లూమియా ఫోన్లు కొనుగోలు చేసిన వారికి 20 జీబీ స్కైడ్రైవ్ స్టోరేజ్ ఉచితమని ఆయన చెప్పారు.