ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ

6 Jun, 2015 04:05 IST|Sakshi
ఎట్టకేలకు భారతీయుడినని ఒప్పుకున్న గిలానీ

శ్రీనగర్: వేర్పాటువాద నేత సయ్యద్ అలీషా గిలానీ ఎట్టకేలకు తాను భారతీయుడినని ఒప్పుకున్నారు. పాస్‌పోర్టుకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఆయన శుక్రవారం పాస్‌పోర్టు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ పాస్‌పోర్టు దరఖాస్తుపత్రంలో తాను భారతీయుడినని రాశారు. వేలిముద్రలు, ఐరిస్ వంటి బయోమెట్రిక్ వివరాలు అందజేశారు. ఈ హురియత్ నేత అస్వస్థతతో ఉన్న తన కుమార్తెను చూసేందుకు సౌదీఅరేబియా వెళ్లదలుచుకున్నారు.  

గిలానీ పాస్‌పోర్టు కార్యాలయం వెలుపల విలేకరులడిగిన ప్రశ్నలకు బదులిస్తూ.. తాను పుట్టుకతో భారతీయుడ్ని కాదని, కానీ తప్పడం లేదని, బలవంతంగా అయ్యానని అన్నారు. గిలానీ జాతీయత కాలమ్‌లో భారతీయుడినని రాయడాన్ని ఓ హురియత్ ప్రతినిధి సమర్థించారు.

మరిన్ని వార్తలు