క్యూ4 లో ఓబీసీకి భారీ నష్టాలు

12 May, 2017 16:15 IST|Sakshi

ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకు  ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌  నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది  జనవరి-మార్చి త్రైమాసిక ఫలితాలను  శుక్రవారం   వెల్లడించింది.   క్యూ4లో రూ.1,218 కోట్ల రూపాయలను ఆర్జించింది.  విశ్లేషకుల అంచనాలతో పోల్చితే రూ. 77.4 కోట్లు నష్టం.  క్యూ4లో రూ. 18 కోట్ల నష్టాలను మూటగట్టుకుంది.
గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో 1,086.5 కోట్ల రూపాయల నికర లాభాలు ఆర్జించగా .. అంతకు ముందు త్రైమాసికంలో రూ.1,429.6 కోట్లుగా ఉంది.  ఎసెట్‌ క్వాలిటీని  మెరుగుపర్చకున్నప్పటికీ ప్రొవిజన్లు మాత్రం 3 శాతం జంప్‌ చేసి రూ.3,050కు పెరిగాయి. గత ఏడాది ఇవి రూ.1,086లుగాఉన్నాయి. ఇతర ఆదాయాలు, వడ్డీ కాని ఆదాయాలు 20 శాతం పెరిగి రూ .590.98 కోట్లు, ఆపరేటింగ్ లాభం 15.75 శాతం పెరిగి రూ .1017.13 కోట్లకు చేరింది.

నికర వడ్డీ ఆదాయం, వడ్డీని సంపాదించిన వడ్డీ మరియు వ్యయం మధ్య వ్యత్యాసం, 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 3.4 శాతం పెరిగి 1,307.3 కోట్ల రూపాయలకు పడిపోయింది. అయితే నికర వడ్డీ మార్జిన్లు 2.14 శాతం నుంచి 2.54 శాతానికి పెరగడం విశేషం. నిరర్ధక ఆస్తులు 13.7 శాతం నుంచి 13.8 శాతాన్ని నమోదుచేశాయి.   ఈ ఫలితాలో నేపథ్యంలో బిఎస్ఇలో  7శాతానికిపైగా కుప్పకూలింది.  
 

>
మరిన్ని వార్తలు