పుష్కరఘాట్ వద్ద గుండెపోటుతో వృద్ధురాలి మృతి

19 Jul, 2015 23:42 IST|Sakshi

కరీంనగర్(ఇబ్రహీంపట్నం): ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్‌కు చెందిన నూనె అన్నపూర్ణ(85) యామాపూర్ రాట్నాల మడుగు పుష్కరఘాట్ వద్ద గుండెపోటుతో మృతి చెందింది.

ఆదివారం పుష్కర స్నానమాచరించడానికి తన కుటుంబసభ్యలతో వెళ్లిన అన్నపూర్ణ ఘాట్ వద్ద స్నానం చేసి బట్టలు మార్చుకునే గదిలోకి వెళ్లి అక్కడే కుప్పకూలింది. కుటుంబ సభ్యులు వైద్య సిబ్బందికి తెలపడంతో ప్రథమ చికిత్స అందించారు. వెంటనే అంబులెన్స్‌లో మెట్‌పల్లి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందింది. అన్నపూర్ణకు ఇటీవలే రెండుసార్లు గుండెపోటు వచ్చిందని బంధువులు తెలిపారు.

మరిన్ని వార్తలు