5న ముంబైకి సత్య నాదెళ్ల

4 Nov, 2015 01:03 IST|Sakshi
5న ముంబైకి సత్య నాదెళ్ల

ముంబై: మైక్రోసాఫ్ట్ చీఫ్ సత్యనాదెళ్ల నవంబర్ 5న ముంబైకి రానున్నారు. నాదెళ్ల ఆ రోజు మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంక్ హెడ్ శిఖా శర్మ, టాటా స్టార్‌బక్స్ సీఈవో అవని ద్వాదా వంటి తదితర పారిశ్రామికవేత్తలతో సమావేశం కానున్నారు. మైక్రోసాఫ్ట్ భాగస్వాములను, వినియోగదారులను, ప్రము ఖ ప్రభుత్వ అధికారులను కూడా కలవనున్నారు.

అలాగే ఆయన ఇక్కడ జరగనున్న మైక్రోసాఫ్ట్ ఫ్యూచర్ అన్‌లీష్‌డ్ కార్యక్రమంలో ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమానికి పలువురు పరిశ్రమ సంబంధిత వ్యక్తులు, ఎంటర్‌ప్రైజెస్ హెడ్స్, డెవలపర్స్, ఎంట్రప్రెన్యూర్స్ హాజరవుతారు.
 

మరిన్ని వార్తలు