పనాజి: గోవాలోని మడ్గావ్ పట్టణానికి సమీపంలో పేలుడు సంభవించి ఒకరు మృతి చెందారు. మరో ఇద్దరు గాయపడ్డారు. మడ్గావ్ పట్టణానికి 40 కిలోమీటర్ల దూరంలోని చాందొర్ గ్రామంలోని ఓ ఇంటిలో ఈ పేలుడు జరిగినట్టు డిఐజీ ఓపీ మిశ్రా తెలిపారు.
ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని ఆయన ధ్రువీకరించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలు వెంటనే తెలియరాలేదు. బాంబు స్వ్కాడ్ను సంఘటనా స్థలానికి తరలించారు.