కుక్కలదాడిలో వ్యక్తి దుర్మరణం

22 May, 2017 14:29 IST|Sakshi

తిరువనంతపురం: వీధి కుక్కల దాడిలో వ్యక్తి మరణించిన ఘటన కేరళలో కలకలం రేపింది. తిరువనంతపురం జిల్లాలోని తీర గ్రామం పుల్లువిల్లకు చెందిన జోస్‌లిన్‌(50) మత్యకారుడిగా జీవిస్తున్నాడు. చేపల వేటకు వెళ్లేందుకుగానూ ఆదివారం ఇంటి నుంచి తీరం వైపునకు బయలుదేరిన అతనిపై వీధి కుక్కలు దాడిచేశాయి. తీవ్రంగా గాయపడ్డ జోస్‌లిన్‌ను గ్రామస్తులు గుర్తించిన తిరువనంతపురం మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికిఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ జోస్‌లిన్‌ సోమవారం ఉదయం ప్రాణాలు కోల్పోయాడు. కేరళలో గడిచిన కొద్ది నెలల్లో కుక్కలదాడిలో నలుగురు చనిపోవడం ప్రభుత్వాధికారులు, సిబ్బంది తీరుపై విమర్శలకు దారితీసింది. ఆదివారం జోస్‌లిన్‌పై దాడి జరిగిన ప్రాంతంలోనే.. ఏడాది కిందట ఓ మహిళను కుక్కలు చంపేశాయి.

మరిన్ని వార్తలు