కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా పీ కే సిన్హా నియామకం

29 May, 2015 15:22 IST|Sakshi

న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్ కార్యదర్శిగా ఐఏఎస్ అధికారి ప్రదీప్ కుమార్ సిన్హా నియమితులయ్యారు. ఈ మేరకు ప్రధాని కార్యాలయం పీకే సిన్హా నియామాకాన్ని ఖరారు చేస్తూ శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోదీ పీకే సిన్హా నియామాకానికి అంగీకారం తెలిపారు. వచ్చే నెల 13 వ తేదీ నుంచి సిన్హా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుత సీఎస్ అజిత్ సేథ్ పదవీ కాలం ముగియనుండటంతో నూతన కేబినెట్ కార్యదర్శి నియామకం అనివార్యమైంది.

మరిన్ని వార్తలు