పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్

8 Oct, 2016 16:59 IST|Sakshi
పీవీ సింధు ఖాతాలో మరో బ్రాండ్

వైజాగ్: ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారిణి, రియో ​ఒలంపిక్ రజత  పతక విజేత పీవీ సింధు మరో ప్రత్యేకతను  తన ఖాతాలో వేసుకుంది.  ప్రఖ్యాతి గాంచిన  వైజాగ్  స్టీల్  సంస్థ , రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ కు బ్రాండ్ అంబాసిడర్ గా  ఎన్నికైంది.  బేస్లైన్ వెంచర్స్,  డైరెక్టర్ , మరియు సహ వ్యవస్థాపకుడు ఆర్ రామకృష్ణన్ ఈ ఒప్పంద  వివరాలు వెల్లడించారు. దీంతో  వైజాగ్ స్టీల్ అథ్లెట్  రంగంలో  ప్రధాన భాగస్వామి మారిందని చెప్పారు.   దీని  ప్రకారం బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్,  భారతదేశం బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మరియు దేశీయ పోటీలలో సింధు ఆడే సమయంలో ఆమె జెర్సీ మీద  కంపెనీ  బ్రాండ్ లోగో ఉండనుందని తెలిపారు.

సింధు ప్రస్తుతం ప్రపంచంలో టాప్ 10 ర్యాంక్ ఆటగాళ్ళ మధ్య రియో ​​ఒక ఒలింపిక్ రజత పతకం గెలుచుకున్న మొదటి భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన సంగతి తెలిసిందే. ఇది తనకు అత్యంత ముఖ్యమైన  ఎండార్స్మెంట్ అని పీవీ సింధు వ్యాఖ్యానించింది. బ్యాడ్మింటన్ క్యాలెండర్ లో  నెలకు కనీసం మూడు ప్రధాన అంతర్జాతీయ ఈవెంట్స్  కు విస్తరించిన నేపథ్యంలో ర్యాంకింగ్స్ మెరుగుకు  ఆర్ఐఎన్ఎల్ విశ్వసనీయ బ్రాండ్ అనిసంతోసం వ్యక్తం చేసింది.  ఖచ్చితంగా తన ఆట మీద దృష్టికి సహాయపడుతుందిని పేర్కొంది. సింధు, వైజాగ్ స్టీల్ రెండూ భారతదేశం యొక్క అమూల్యమైన ఆస్తులు అని ఆర్ఐఎన్ఎల్ సీఎండీ  పి మధుసూదన్ చెప్పారు . తాజా  బాండ్ వారికి, దేశానికి  గర్వకారణమన్నారు.
 

మరిన్ని వార్తలు