మరోసారి కాల్పుల విరమణ ఉల్లంఘించిన పాక్

20 Jul, 2014 08:37 IST|Sakshi

పొరుగు దేశమైన పాకిస్థాన్ మరో సారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్మూ కాశ్మీర్ ఆర్ ఎస్ పురా సెక్ట్రర్లోని సరిహద్దు భద్రత దళం లక్ష్యంగా ఔట్ పోస్ట్లపై పాక్ సైన్యం కాల్పులకు తెగబడింది. దాంతో సరిహద్దు భద్రత దళం వెంటనే అప్రమత్తమై... పాక్ సైన్యంపై ఎదురుకాల్పులకు దిగింది. గతేడాది పాక్ సైన్యం 149 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. ఆ కాల్పులలో పలువురు భారతీయ జవాన్లు మృతి చెందగా, పదుల సంఖ్యలో భారత జవాన్లు గాయపడిన విషయం విదితమే. 

మరిన్ని వార్తలు