-

ఇంత ఘోరంగా ఆడుతారా?: పాక్‌పై నిప్పులు

6 Jun, 2017 12:34 IST|Sakshi
ఇంత ఘోరంగా ఆడుతారా?: పాక్‌పై నిప్పులు
  • సోషల్‌ మీడియాలో తమ జట్టును కడిగిపారేస్తున్న నెటిజన్లు
  •  
    చాంపియన్స్‌ ట్రోఫీలో ఎంతో ఆసక్తి రేపిన దాయాదాల పోరు ముగిసినా.. ఆ మ్యాచ్‌ తాలుకు ప్రకంపనలు ఇంకా రేగుతూనే ఉన్నాయి. బద్ధ విరోధి అయిన పాకిస్థాన్‌ జట్టుపై 124 పరుగుల తేడాతో విజయం సాధించిన టీమిండియాపై మనదేశంలో ప్రశంసలు వెల్లువెత్తుతుండగా.. అదే సమయంలో అన్ని విభాగాల్లో విఫలమై.. చిత్తుగా ఓడిన పాకిస్థాన్‌ జట్టుపై వారి దేశంలో తీవ్ర ఆగ్రహం పెల్లుబుక్కుతోంది. సోషల్‌ మీడియా వేదికగా పాక్‌ నెటిజన్లు తమ జట్టుపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. భారత్ చేతిలో ఇంత దారుణంగా ఓడిపోతారా అంటూ పాక్‌ క్రికెటర్లను ఉతికి ఆరేస్తున్నారు. తమ క్రికెటర్లను కించపరుస్తూ మెమెలు, ఫొటోలు, ట్వీట్లు, పోస్టులు పెట్టి తమ నిరసనను చాటుతున్నారు.  
మరిన్ని వార్తలు